చంద్రబాబుకు నిద్రలేస్తే అదే పని

టీడీపీ అధినేత చంద్రబాబుకు నిద్ర లేచినప్పటి నుంచి వైసీపీ నేతలను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామిని బర్త్ రఫ్ [more]

Update: 2020-04-14 09:20 GMT

టీడీపీ అధినేత చంద్రబాబుకు నిద్ర లేచినప్పటి నుంచి వైసీపీ నేతలను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామిని బర్త్ రఫ్ చేయడం ఎందుకని పెద్దిరెడ్డి ప్రశ్నించారు. ఆయన క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా బర్త్ రఫ్ చేయాలని అడగటం చంద్రబాబు నీచ మనస్తత్వానికి నిదర్శనమన్నారు. నారాయణ స్వామి మీద తప్పుడు వార్తలను చంద్రబాబు రాయిస్తున్నారన్నారు. మైనారిటీలకు చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని పెద్దిరెడ్డి కోరారు. హైదరాబాద్ లో ఉంటూ స్టేట్ మెంట్లు ఇవ్వడమే పనిగా పెట్టుకున్నారన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైసీపీదే గెలుపని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Tags:    

Similar News