వారికి జగన్ ప్రభుత్వం సాయం

కడప జిల్లా మామిళ్ల పల్లి పేలుడు ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు పది లక్షల పరిహారం ఇవ్వాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఘటనపై విచారణకు [more]

Update: 2021-05-10 00:52 GMT

కడప జిల్లా మామిళ్ల పల్లి పేలుడు ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు పది లక్షల పరిహారం ఇవ్వాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. ఐదు ప్రభుత్వ శాఖలు ఈ విచారణ చేపట్టాయని, ఐదు రోజుల్లో నివేదిక వస్తుందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. మృతుల కుటుంబాలకు పది లక్షలు, గాయపడిన వారికి ఐదు లక్షల పరిహారం చెల్లించనున్నట్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. క్వారీ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లు ప్రాధమిక విచారణలో తేలినట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.

Tags:    

Similar News