చంద్రబాబు ఆ నిర్ణయం అందుకే?

ఆంధ్రప్రదేశ్ లో పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని పార్టీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ స్వాగతించారు. దేశం మొత్తం ఏపీ వైపు చూడాలనే చంద్రబాబు [more]

Update: 2021-04-05 01:09 GMT

ఆంధ్రప్రదేశ్ లో పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని పార్టీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ స్వాగతించారు. దేశం మొత్తం ఏపీ వైపు చూడాలనే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే ఎన్నికలను బహిష్కరించాల్సి వచ్చిందని పయ్యావుల కేశవ్ తలెిపారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఎన్ని అరాచకాలకు పాల్పడిందో అందరం చూశామన్నారు. ఒక్క విడతలోనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను ఎలా నిర్వహిస్తారని పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు.

Tags:    

Similar News