Payyavula : కేసీఆర్ కు ఉన్న స్పృహ కూడా జగన్ కు లేదు

పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉన్న స్పృహ కూడా ఏపీ ముఖ్యమంత్రికి లేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ అన్నారు. కేసీఆర్ గంజాయిపై స్పందించి వెంటనే [more]

Update: 2021-10-21 06:42 GMT

పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉన్న స్పృహ కూడా ఏపీ ముఖ్యమంత్రికి లేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ అన్నారు. కేసీఆర్ గంజాయిపై స్పందించి వెంటనే చర్యలు ప్రారంభించారన్నారు. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి మాత్రం ప్రశ్నస్తే కేసులు పెట్టి, దాడులు చేయిస్తున్నారని పయ్యావుల కేశవ్ అన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, ప్రస్తుతం జరిగిన దాడులపై సీబీఐ చేత విచారణ చేయించాలని పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పోలీస్ శాఖను దిగజార్చారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

Tags:    

Similar News