తెలంగాణ ఎన్నికలపై పవన్ సర్వే... నిజమెంత..?

Update: 2018-12-04 08:23 GMT

తెలంగాణలో ఎన్నికలకు దూరంగా ఉన్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. తెలంగాణ ఎన్నికలపై రేపు ఆయన తన అభిప్రాయం చెబుతానని ప్రకటించారు. అయితే, తెలంగాణ ఎన్నికలపై పవన్ కళ్యాణ్ ఓ స్వతంత్ర బృందంతో సర్వే చేయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఆలేరు నుంచి బీఎల్ఎఫ్ తరపున పోటీ చేస్తున్న మోత్కుపల్లి నర్సింహులు విజయం సాధించనున్నారని ఈ సర్వేలో తేలిందట. ఈ మేరకు పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రచారంలో ఉన్న మోత్కుపల్లికి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారని ప్రచారం జరుగుతోంది. అయితే, పవన్ సర్వే జరుపుతున్నట్లుగా ఎటువంటి సమాచారం లేదు. పైగా ఆయన ఏపీలో ప్రజా పోరాట యాత్రలతో బీజీగా ఉన్నారు. ఈ సమయంలో ఆయన తెలంగాణ రాజకీయాలపై సర్వే చేసే అవకాశం ఉందా అనేది మాత్రం అనుమానమే. గతంలో ఆయన ఎప్పుడు సర్వేలు చేయించిన దాఖలాలు కూడా లేవు.

Similar News