పవన్ కల్యాణ్ తనకు అధికారం మీద మక్కువ లేదని మరోసారి స్పష్టం చేశారు. తాను ముఖ్యమంత్రిని కావాలని ఆరాటపడే వ్యక్తిని కాదన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడమే తనకు ప్రధమ ప్రాధాన్యమన్నారు. సమస్యలపై పోరాడేందుకు తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని చెప్పారు. భీమవరంలో జరిగిన ఒక సమావేశంలో పవన్ మాట్లాడుతూ కులాలను ఓటు బ్యాంకుకుగా చూస్తూ రాజకీయాలు చేయడం తనకు అస్సలు ఇష్టం ఉండదని పవన్ తెలిపారు. ప్రతి కులాన్ని , వారి ఆచార, సంప్రదాయాలను కూడా గౌరవిస్తానని పవన్ చెప్పారు. ఒక రాజకీయ పార్టీని నడపడటమంటే కష్టమేనని, ఖర్చుతో కూడుకున్నదని ఆయన అభిప్రాయపడ్డారు. కాని తాను డబ్బు లేకపోయినా ధైర్యంగా పార్టీని నడుపుతానని చెప్పారు.