నంద్యాల‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌ర్నూలు జిల్లా నంద్యాలకు వెళ్లారు. ఇటీవ‌ల క‌న్నుమూసిన నంద్యాల ఎంపీ, జ‌న‌సేన పార్టీ అభ్య‌ర్థి ఎస్పీవై రెడ్డి స‌మాధినికి ప‌వ‌న్ [more]

Update: 2019-05-11 11:29 GMT

జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌ర్నూలు జిల్లా నంద్యాలకు వెళ్లారు. ఇటీవ‌ల క‌న్నుమూసిన నంద్యాల ఎంపీ, జ‌న‌సేన పార్టీ అభ్య‌ర్థి ఎస్పీవై రెడ్డి స‌మాధినికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో పాటు ఆ పార్టీ కీల‌క నేత నాదెండ్ల మ‌నోహ‌ర్ నివాళుల‌ర్పించారు. అనంత‌రం ఎస్పీవై రెడ్డి కుటుంబ‌స‌భ్యుల‌ను ఓదార్చి సానుభూతి వ్య‌క్తం చేశారు. ఎస్పీవై రెడ్డి మూడుసార్లు నంద్యాల ఎంపీగా ప‌నిచేశారు. ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో టీడీపీ ఆయ‌న‌కు టిక్కెట్ ఇవ్వ‌క‌పోవ‌డంతో చివ‌రి నిమిషంలో జ‌న‌సేన పార్టీ నుంచి టిక్కెట్ తెచ్చుకున్నారు.

Tags:    

Similar News