కోటి రూపాయలు ఇచ్చిన పవన్

సైనిక కేంద్ర కార్యాలయానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోటి రూపాయల విరాళం ఇచ్చారు. గతంలోనే ఈ సాయాన్ని ప్రకటించిన పవన్ కల్యాణ్ నేడు ఢిల్లీ వెళ్లి [more]

Update: 2020-02-20 06:48 GMT

సైనిక కేంద్ర కార్యాలయానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోటి రూపాయల విరాళం ఇచ్చారు. గతంలోనే ఈ సాయాన్ని ప్రకటించిన పవన్ కల్యాణ్ నేడు ఢిల్లీ వెళ్లి సైనిక్ బోర్డుకు కోటి రూపాయలను ఇచ్చారు. సైనికులంటే తనకు ఇష్టమని, దేశం కోసం ప్రాణాలకు తెగించే వారికి ఉడతా భక్తిగా తాను ఈ సాయం అందించినట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. గాయపడిన సైనికులు, అమర జవాన్ల కుటుంబాలకు సాయం అందించేదుకే ఈ విరాళాన్ని అందించినట్లు పవన్ కల్యాణ్ చెప్పారు. ఈరోజు ఢిల్లీలో పార్టీ పెద్దలను కలుస్తానా? లేదా? అన్నది చెప్పలేనని అన్నారు.

Tags:    

Similar News