బ్రేకింగ్ : లెఫ్ట్ టు ఢిల్లీ

రెండు రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిరుగు ప్రయాణమయ్యారు. కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ ఎయిర్ పోర్టుకు పవన్ కల్యాణ్ చేరుకున్నారు. అయితే [more]

Update: 2020-01-13 08:43 GMT

రెండు రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిరుగు ప్రయాణమయ్యారు. కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ ఎయిర్ పోర్టుకు పవన్ కల్యాణ్ చేరుకున్నారు. అయితే ఈ రెండు రోజుల్లో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాతో మాత్రం అధికారికంగా పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. జేపీ నడ్డా దృష్టికి రాజధాని అమరావతి రైతు సమస్యలను తీసుకెళ్లారు. రాజధాని తరలింపును కేంద్రం అడ్డుకునే విషయంపై చర్చించారు. అయితే రెండు రోజుల ఢిల్లీపర్యటనలో అమిత్ షా, మోదీల అపాయింట్ మాత్రం పవన్ కల్యాణ్ కు లభించలేదు. నిన్న ఆర్ఎస్ఎస్ నేతలతో పవన్ కల్యాణ్ చర్చించినట్లు తెలుస్తోంది. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత పవన్ కల్యాణ్ కాకినాడకు చేరుకోననున్నారు.

Tags:    

Similar News