బాబు పెద్ద తప్పు చేశాడు

చంద్రబాబు రాజధాని విషయంలో పెద్ద తప్పు చేశారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పోలవరం ప్రాజెక్టు వద్దకు బస్సులు పెట్టి జనాలను తరలించారు తప్పించి, అమరావతి [more]

Update: 2019-12-31 11:28 GMT

చంద్రబాబు రాజధాని విషయంలో పెద్ద తప్పు చేశారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పోలవరం ప్రాజెక్టు వద్దకు బస్సులు పెట్టి జనాలను తరలించారు తప్పించి, అమరావతి కోసం త్యాగం చేసిన రైతుల భూములను, ఇక్కడ జరిగిన నిర్మాణాలను మాత్రం ప్రపంచానికి తెలియజెయ్య కుండా ప్రభుత్వం తప్పు చేసిందన్నారు. తుళ్లూరు లో రైతులను కలసి పవన్ కల్యాణ్ సంఘీభావాన్ని ప్రకటించారు. తాను ఓట్ల కోసం రాజకీయం చేయనని, జగన్ రెడ్డి, చంద్రబాబు లాగా మాయమాటలు చెప్పనని పవన్ కల్యాణ్ తెలిపరు. రాజధానిని మార్చడం కరెక్ట్ కాదని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేందుకేనా 151 మంది ఎమ్మెల్యేలు గెలిపించింది? అని పిలుపు నిచ్చారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలు ఎందుకు వలసపోతున్నారని నిలదీశారు? తాను రైతుల పక్షాన ఉంటానని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.

Tags:    

Similar News