రాజధానిలో పవన్ పర్యటన.. టెన్షన్ టెన్షన్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రోడ్డుపైనే దీక్షకు దిగారు. తనను రాజధాని ప్రాంతంలో పర్యటించకుండా పోలీసులు అడ్డుకోవడంతో దానికి నిరసనగా చెక్ పోస్ట్ వద్ద రోడ్డుపై పవన్ [more]

Update: 2019-12-31 08:59 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రోడ్డుపైనే దీక్షకు దిగారు. తనను రాజధాని ప్రాంతంలో పర్యటించకుండా పోలీసులు అడ్డుకోవడంతో దానికి నిరసనగా చెక్ పోస్ట్ వద్ద రోడ్డుపై పవన్ కల్యాణ్ దీక్షకు దిగారు. తనను మందడంలోకి అనుమతించాలని పవన్ కల్యాణ్ కోరుతున్నారు. దీంతో వెంకటాయపాలెం వద్ద టెన్షన్ వాతావరణం నెెలకొంది. మందడం గ్రామంలోకి పవన్ కల్యాణ్ ప్రవేశించకుండా పోలీసు బలగాలు పెద్దయెత్తున మొహరించాయి. రోడ్డుపై ముళ్ల కంచెలు వేయడంతో కొందరికి గాయాలు కూడా అయ్యాయ. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని పవన్ కల్యాణ్ కు పోలీసులు సూచిస్తున్నారు. జగన్ సచివాలయం నుంచి క్యాంప్ ఆఫీస్ కు వెళ్లిన తర్వాతనే పోలీసులు పవన్ కల్యాణ్ ను అనుమతించే అవకాశం ఉంది.

Tags:    

Similar News