జగన్ ఒక ప్రాంతానికే ముఖ్యమంత్రి

నాడు జగన్ అసెంబ్లీలో అమరావతిని రాజధానిగా ఒప్పుకుని నేడు కాదంటారా? అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. రాజధాని ప్రాంతంలో పవన్ కల్యాణ్ పర్యటించారు. రాజధాని [more]

Update: 2019-12-31 06:49 GMT

నాడు జగన్ అసెంబ్లీలో అమరావతిని రాజధానిగా ఒప్పుకుని నేడు కాదంటారా? అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. రాజధాని ప్రాంతంలో పవన్ కల్యాణ్ పర్యటించారు. రాజధాని రైతులకు జనసేన అండగా ఉంటుందన్నారు. పిల్లల భవిష్యత్తు పణంగా పెట్టి భూములిచ్చిన రైతులను బాధపెట్టడం తగదన్నారు. ఏపీ రాజధానిగా అమరావతి కొనసాగాలని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. అన్నదాత కన్నీరు పెడితే ఏ దేశం బాగుపడదని పవన్ కల్యాణ్ అన్నారు. న్యాయం చేస్తుందని వైసీపీకి ఓటేస్తే అన్యాయం చేస్తుందన్నారు. అమరావతిపై జగన్ కు ఎందుకంత కక్ష అని ప్రశ్నించారు. జగన్ ఒక ప్రాంతానికే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని పవన్ కల్యాణ్ఆరోపించారు. రాజధాని రైతులకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తానని పవన్ కల్యాణ్ ప్రకటించారు. జనసేన రైతు పక్షపాతి అని పవన్ కల్యాణ్ తెలిపారు.

Tags:    

Similar News