రేపు తిరుపతికి జనసేనాని

రేపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిరుపతిలో పర్యటించనున్నారు. బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్న ప్రభకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. తిరుపతిలో జరిగే ర్యాలీలో పాల్గొనున్న [more]

Update: 2021-04-02 01:24 GMT

రేపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిరుపతిలో పర్యటించనున్నారు. బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్న ప్రభకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. తిరుపతిలో జరిగే ర్యాలీలో పాల్గొనున్న పవన్ కల్యాణ్ ఆ తర్వాత జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. పవన్ కల్యాణ్ తిరుపతి వస్తుండటంతో జనసేన కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ర్యాలీ, సభను నిర్వహించుకోవాలని ఇప్పటికే పార్టీ నేతలకు పోలీసులు సూచించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తుకుండా పోలీసులు పవన్ కల్యాణ్ సభకు, ర్యాలీకి భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు.

Tags:    

Similar News