నేడు పవన్ పర్యటన… పోలీసులు అనుమతి లేదన్నా?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. దివీస్ పరిశ్రమను నిరసిస్తున్న బాధితులకు పవన్ అండగా నిలవనున్నారు. తుని నియోజకవర్గంలోని తొండంగి మండలం [more]

Update: 2021-01-09 01:47 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. దివీస్ పరిశ్రమను నిరసిస్తున్న బాధితులకు పవన్ అండగా నిలవనున్నారు. తుని నియోజకవర్గంలోని తొండంగి మండలం కొత్త పాకలలో దివీస్ లేబొరేటరీ బాధితులను పవన్ కల్యాణ్ పరామర్శిస్తారు. తర్వాత జరిగే బహిరంగ సభలో మాట్లాడతారు. అయితే పవన్ పర్యటనకు అనుమతి లేదని జిల్లా ఎస్పీ ప్రకటించారు. దీంతో పవన్ కల్యాణ్ పర్యటన కొనసాగుతుందా? లేదా? అన్నది ఉత్కంఠగా మారింది. పోలీసులు అనుమతి లేదని చెప్పిన కొంత సమయానికే తాను రాజమండ్రికి వస్తున్నట్లు పవన్ కల్యాణ్ ట్వీట్ చేయడం విశేషం. దీంతో నేడు తూర్పు గోదావరి జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Tags:    

Similar News