మళ్లీ మొదటి నుంచి రావాల్సిందే

స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను తిరిగి మొదటి నుంచి ప్రారంభించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరారు. ఎన్నికలను వాయిదా వేయడం కాదని తిరిగి తొలి నుంచి [more]

Update: 2020-03-15 06:09 GMT

స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను తిరిగి మొదటి నుంచి ప్రారంభించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరారు. ఎన్నికలను వాయిదా వేయడం కాదని తిరిగి తొలి నుంచి ప్రారంభించా లన్నారు. నామినేషన్ల ప్రక్రియను అడ్డుకుని వైసీపీ ప్రభుత్వం అరాచకాలకు పాల్పడిందన్నారు. పోలీసులు, అధికారులు పూర్తిగా వైసీపీకి వత్తాసు పలుకుతున్నారన్నారు. దీనిపై తాము కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని అధికారులు భావిస్తే అది పొరపాటు అవుతుందని చెప్పారు. ఎన్నికలను వాయిదా వేయడంతో సరిపోదని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే తిరిగి మొదటి నుంచి ప్రారంభించాలని పవన్ కల్యాణ్ కోరారు.

Tags:    

Similar News