కొంత విరామం తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిరిగి పోరాట యాత్రను ప్రారంభించారు. మరికాసేపట్లో ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన భీమవరంలో నేడు పర్యటించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని కాళ్ల మండలం పెద్దఅమిరంలోని ఒక ఫంక్షన్ హాలులో పవన్ బీసీ సంఘాల నేతలతో సమావేశం కానున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తర్వాత పవన్ తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.