పవన్ కు భద్రత పెంపు

Update: 2018-09-28 13:23 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతుందని, అందుకు ముగ్గురు వ్యక్తులు మాట్లాడుకున్న సంభాషణను కొందరు తనకు విన్పించారని, ఆ ముగ్గురెవరో తనకు తెలుసనని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఆ ముగ్గురు ఎవరనేది పవన్ చెప్పలేదు. దీంతో తూర్పు గోదావరి ఎస్సీ రవిప్రకాష్ దీనిపై స్పందించారు. ఆ ముగ్గురెవరో తమకు చెప్పి, తగిన ఆధారాలు చూపిస్తే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. పవన్ వ్యాఖ్యలతో ఆయనకు భద్రత పెంచుతున్నట్లు కూడా ఎస్పీ రవి ప్రకాష్ చెప్పారు.

Similar News