సైనికులలా ముందుకు వెళ్తాం

Update: 2018-07-09 07:41 GMT

హిందూ ధర్మ పరిరక్షణకు ఉప్పల్ నుంచి యాదాద్రి వరకు పాదయత్ర చేపట్టాలనుకున్న పరిపూర్ణానంద స్వామిని పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్రకు అనుమతి రద్దు చేసి ఆయనను గృహ నిర్భంధం చేశారు. దీంతో ఆయన అనుచరులు, పలు హిందూ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాంతియుతంగా చేయాలనుకుంటున్న పాదయాత్రకు అనుమతి నిరాకరించడం తగదన్నారు. స్వామిని నిర్భంధించడం దారుణమని ఆరోపిస్తున్నారు. అంతకుముందు పరిపూర్ణానంద మాట్లాడుతూ... ధర్మాన్ని ఆచరించే క్రమంలో స్వాములకు సహనం ఉంటుందని, అదే ధర్మాన్ని రక్షించేందుకు సైనికులా ముందుకువెళ్తామని పరిపూర్ణానంద స్వామి పేర్కొన్నారు. రాముడిపై తీవ్ర వ్యాఖలు చేసిర కత్తి మహేష్ పై దేశద్రోహం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. కోట్లాది మంది పూజించే భగవంతులని ఆయన అవమాన పరిచాడని, కావున ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీనిపై స్పందించాలని కోరారు.

Similar News