హుజూర్ నగర్ లో కారేనట

ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా తరువాత జరిగిన హుజూర్ నగర్ ఉప ఎన్నికలో అధికార పార్టీ టి.ఆర్.ఎస్ గెలుపు తథ్యమని ఆరా సంస్థ వెల్లడించింది. గతంలో అనేకసార్లు [more]

Update: 2019-10-21 13:26 GMT

ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా తరువాత జరిగిన హుజూర్ నగర్ ఉప ఎన్నికలో అధికార పార్టీ టి.ఆర్.ఎస్ గెలుపు తథ్యమని ఆరా సంస్థ వెల్లడించింది. గతంలో అనేకసార్లు ఎన్నికల ఫలితాలపై సర్వే అంచనాలను వెల్లడించింది ఆరా సంస్థ. ఈ క్రమంలో హుజూర్ నగర్ ఉప ఎన్నికలోనూ ఆరా సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో టీఆర్ఎస్ కే విజయావకాశాలున్నట్లు తెలిపింది. టి.ఆర్.ఎస్ కు 50.48శాతం, కాంగ్రెస్ కు 39.95శాతం, ఇతరులు 9.57శాతం ఓట్లు రావచ్చని ఆరా సంస్థ పేర్కొంది. ఉత్కంఠభరితంగా సాగిన హుజూర్ నగర్ ఉప ఎన్నికలో మాత్రం ఎవరికి వారు తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

 

Tags:    

Similar News