గరుడ గుట్టు విప్పాల్సిందే....!!

Update: 2018-10-30 13:43 GMT

ప్రస్తుతం ఆపరేషన్ గరుడ వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్ గా మారిందని, బీజేపీని దోషిగా చిత్రీకరించే ప్రయత్నం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ కు ఫిర్యాదు చేశారు. ఆపరేషన్ గరుడ వెనక ఎవరు ఉన్నారో నిజాలు నిగ్గు తేల్చాలని ఏపీ బీజేపీ నేతలు కోరారు. ఆపరేషన్ గరుడను బయటకు తెచ్చిన శివాజీని వెంటనే విచారించాలని బీజేపీ నేతలు కోరారు. వైసీపీ అధినేత జగన్ పై హత్యాయత్నం కూడా శివాజీ ముందుగానే చెప్పారని చంద్రబాబు చెబుతున్నారని, మరి అలాంటి సమాచారం ఉంటే ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఆపరేషన్ గరుడ అనేది తెలుగుదేశం పార్టీ కుట్రలో భాగమేనన్నారు. తాము దీనిపై దర్యాప్తు జరపాలని రెండు నెలల క్రితమే ఏపీ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, అందుకే హోం మంత్రిని కలిసి విచారణ చేయాలని కోరామన్నారు.

Similar News