అమెరికాలో కాల్పులు 20 మంది మృతి

అమెరికాలో మరోసారి కాల్పులతో దుండగులు రెచ్చిపోయారు. టెక్సాస్ రాష్ట్రంలోని ఎల్ పాసోలో ఉన్న వాల్ మార్ట్ లో నిన్న అర్థరాత్రి దుండగులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. [more]

Update: 2019-08-04 02:16 GMT

అమెరికాలో మరోసారి కాల్పులతో దుండగులు రెచ్చిపోయారు. టెక్సాస్ రాష్ట్రంలోని ఎల్ పాసోలో ఉన్న వాల్ మార్ట్ లో నిన్న అర్థరాత్రి దుండగులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే కాల్పులకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. దాదాపు 20 మంది వరకూ ఈ కాల్పుల్లో మృతి చెంది ఉండవచ్చని అంచనా. అనేక మంది గాయాల పాలయ్యారు. కాల్పులు జరిపిన వారిలో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Tags:    

Similar News