ఓటుకు నోటు లో ఏసీబీ స్పీడ్ పెంచిందా?

Update: 2018-05-10 03:11 GMT

ఓటుకు నోటు కేసులో చంద్రబాబు మీద ఛార్జిషీటు అవినీతి నిరోధక శాఖ వేయనుందా? మూడో ఛార్జిషీట్ లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును నిందితుడిగా చేర్చనుందా? అవుననే అంటున్నాయి ఏసీబీ వర్గాలు, హైదరాబాద్, ఛండీఘడ్ ఫోరెన్సిక్ నిపుణులు ఆ వాయిస్ చంద్రబాబుదేనని తేల్చడంతో మూడో ఛార్జిషీట్ ను వచ్చే వారంలో వేయడానికి ఏసీబీ సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. చంద్రబాబుతో పాటు మరో ఏపీ మంత్రిని కూడా మూడో ఛార్జిషీట్ లో చేర్చనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. రెండు రోజుల్లో ఛార్జిషీట్ ను సిద్ధం చేసి న్యాయనిపుణుల పరిశీలనానంతరం కోర్టులో మూడో ఛార్జి షీట్ వేస్తారని ఏసీబీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఓటుకు నోటు కేసులో విచారణ వేగవంతమయిందంటున్నారు. మరోవైపు చంద్రబాబు కూడా దీనిపై న్యాయనిపుణులతో చర్చిస్తున్నట్లు సమాచారం.

Similar News