వారిని తప్పించబోం… ఎన్నికల కమిషన్ ఆదేశాలు బుట్టదాఖలు

ఎన్నికల కమిషన్ ఆదేశాలను ప్రభుత్వం ఇప్పటి వరకూ పాటించలేదు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గుంటూరు, చిత్తూరు కలెక్టర్లను బదిలీ చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. [more]

Update: 2020-03-17 04:50 GMT

ఎన్నికల కమిషన్ ఆదేశాలను ప్రభుత్వం ఇప్పటి వరకూ పాటించలేదు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గుంటూరు, చిత్తూరు కలెక్టర్లను బదిలీ చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. కొందరు పోలీసు అధికారులను కూడా సస్పెండ్ చేయాలని సిఫార్సు చేశారు. ఆదివారం ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసినా ప్రభుత్వం మాత్రం వీటిని ఏమాత్రం పట్టించుకోలేదు. చీఫ్ సెక్రటరీ ఎన్నికల కమిషనర్ కు రాసిన లేఖలో ఎన్నికల ప్రక్రియలో అధికారులు నిక్కచ్చిగా వ్యవహరించారని, వారిపై జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని కోరారు. ఇప్పటి వరకూ గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లను బాధ్యతల నుంచి రాష్ట్ర ప్రభుత్వం తప్పించకపోవడం చర్చనీయాంశమైంది.

Tags:    

Similar News