మార్చి 1న నిమ్మగడ్డ అఖిలపక్ష సమావేశం

మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఆయన మార్చి 1వ తేదీన అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. [more]

Update: 2021-02-27 02:02 GMT

మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఆయన మార్చి 1వ తేదీన అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ మేరకు అన్ని పార్టీలకు ఆహ్వానం పంపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించేందుకు, మున్సిపల్ ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. వారి సలహాలను, సూచనలను నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకోనున్నారు.

Tags:    

Similar News