బ్రేకింగ్ : నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంచలన నిర్ణయం

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో నామినేషన్లు వేయలేని వారికి మరోసారి అవకాశం కల్పించాలని నిర్ణయించారు. [more]

Update: 2021-02-18 12:39 GMT

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో నామినేషన్లు వేయలేని వారికి మరోసారి అవకాశం కల్పించాలని నిర్ణయించారు. అయితే నామినేషన్లు వేయలేని వారు సంబంధిత జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ నెల 20వ తేదీ లోపు తమ ఫిర్యాదులను కలెక్టర్లకు తెలియజేయాలని, న్యాయంగా నామినేషన్లు వేయలేకపోయిన వారికి మరోమారు అవకాశం కల్పిస్తామని చెప్పారు. గతంలో ఎక్కడైతే ఎన్నికలు ఆగాయో అక్కడి నుంచే ఎన్నికలను ప్రారంభించాలని ప్రభుత్వం ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కోరింది. దానిని పాటిస్తూనే గతంలో నామినేషన్లు వేయలేని వారికి అవకాశం కల్పించాలని నిర్ణయించారు. కలెక్టర్ల నుంచి వచ్చిన నివేదిక మేరకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కొత్తగా నామినేషన్లు వేయాలనుకుంటే మాత్రం కుదరదని చెప్పారు.

Tags:    

Similar News