ఆ రెండు జిల్లాల కలెక్టర్లపై నిమ్మగడ్డ…?

ఆ రెండు జిల్లాల కలెక్టర్లను బదిలీ చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోసారి ప్రభుత్వాన్ని కోరనున్నారు. గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లను బదిలీ [more]

Update: 2021-01-22 04:59 GMT

ఆ రెండు జిల్లాల కలెక్టర్లను బదిలీ చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోసారి ప్రభుత్వాన్ని కోరనున్నారు. గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లను బదిలీ చేయాలని గతంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. కానీ ప్రభుత్వం అమలు చేయలేదు. ఇప్పుడు ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చినందున మరోసారి ఈ రెండు జిల్లాల కలెక్టర్ల వ్యవహారం చర్చకు వస్తోంది. వీరితో మాట్లాడకుండా నేరుగా జాయింట్ కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మాట్లాడుతున్నట్లు తెలిసింది. మరోసారి ఆ రెండు జిల్లాల కలెక్టర్లను బదిలీ చేయాలని ప్రభుత్వాన్ని నిమ్మగడ్డ రమేష్ కోరనున్నారు. కలెక్టర్ల బదిలీ విషయం నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు.

Tags:    

Similar News