నేడు నీలం సాహ్ని అఖిల పక్ష సమావేశం

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని నేడు అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై ఆమె రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. ఇప్పటికే జనసేన, [more]

Update: 2021-04-02 01:19 GMT

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని నేడు అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై ఆమె రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. ఇప్పటికే జనసేన, టీడీపీ, బీజేపీ, సీీపీఐ వంటి పార్టీలు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. న్యాయస్థానాలను కూడా ఆశ్రయించాయి. దీనిపై చర్చించేందుకు అన్ని పార్టీల నేతలతో నీలం సాహ్ని సమావేశం కానున్నారు. ఈ సమావేశం తర్వాత ఎన్నికలపై ఆమె నిర్ణయం తీసుకోనున్నారు.

Tags:    

Similar News