బ్రేకింగ్ : నిమ్మగడ్డకు నీలం సాహ్ని లేఖ

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ లేఖ రాశారు. స్థానిక ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని రద్దు చేసుకోవాలని సీఎస్ నీలం [more]

Update: 2020-03-16 03:43 GMT

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ లేఖ రాశారు. స్థానిక ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని రద్దు చేసుకోవాలని సీఎస్ నీలం సాహ్ని రమేష్ కుమార్ ను కోరారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందలేదని ఆమె లేఖలో తెలిపారు. కరోనా వైరస్ నియంత్రణకు ఏపీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందన్నారు. పోలింగ్ కు ఎటువంటి ఇబ్బంది ఉండదని తెలిపారు. పోలింగ్ రోజున జనం గుమికూడ కుండా ఉండేదుకు చర్యలు తీసుకుంటామని సీఎస్ లేఖలో పేర్కొన్నారు. ఎన్నిక నిర్వహణకు అడ్డంకి కాకుండా కరోనా నియంత్రణకు చర్యలు చేపట్టవచ్చని ఆమె సూచించారు. కాగా మరికాసేపట్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలవనున్నారు.

Tags:    

Similar News