రోజాను పొగిడారు… ప్రభుత్వాన్ని తిట్టారు

నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ వ్యాఖ్యలు మరవక ముందే నగరి మున్సిపల్ కమిషనర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన సెల్ఫీ వీడియో విడుదల చేశారు. అయితే తాము కరోనా [more]

Update: 2020-04-10 08:03 GMT

నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ వ్యాఖ్యలు మరవక ముందే నగరి మున్సిపల్ కమిషనర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన సెల్ఫీ వీడియో విడుదల చేశారు. అయితే తాము కరోనా కట్టడి కోసం ఇంత కష్టపడుతున్నా ప్రభుత్వం నుంచి పూర్తిగా సహకారం అందడం లేదన్నారు. నిధులు విడుదల చేయడం లేదన్నారు. నగరి మున్సిపాలిటీ పరిధిలో నాలుగు పాజిటివ్ కేసులు నమోదయ్యాయని చెప్పారు. అయితే నగరి ఎమ్మెల్యే రోజాను మాత్రం ఆయన పొగిడారు. ఎమ్మెల్యే లేకపోతే నగరి ప్రజలు ఎమయిపోయి ఉండేవారో అని ఆందోళన వ్యక్తం చేశారు. ఏ ఒక్క రాజకీయ పార్టీ నేత కూడా ఆదుకునేందుకు ముందుకు రావడంలేదని, పారిశుద్ధ్య కార్మికులను కూడా పట్టించుకోవడం లేదన్నారు. రోజా మాత్రం బాగా స్పందిస్తున్నారన్నారు. దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించినట్లు తెలిసింది.

Tags:    

Similar News