చంద్ర‌బాబుపై న‌రేంద్ర మోడీ సెటైర్లు

కూట‌ములు క‌ట్టి కేంద్ర రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని భావిస్తున్న తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు చంద్ర‌బాబు, కేసీఆర్ ను న‌రేంద్ర మోడీ సీరియ‌స్ గా తీసుకుంటున్న‌ట్లు క‌నిపించ‌డం లేదు. [more]

Update: 2019-05-10 12:16 GMT

కూట‌ములు క‌ట్టి కేంద్ర రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని భావిస్తున్న తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు చంద్ర‌బాబు, కేసీఆర్ ను న‌రేంద్ర మోడీ సీరియ‌స్ గా తీసుకుంటున్న‌ట్లు క‌నిపించ‌డం లేదు. శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… చంద్ర‌బాబు, కేసీఆర్ కూట‌ముల కోసం స‌మావేశాలు క‌డుగుతున్నారు క‌దా అన్న ప్ర‌శ్న‌ను ఆయ‌న తేలిగ్గా తీసుకున్నారు. క్రికెట్ లో ఔటై ఎంపైర్ ను తిడుతున్న‌ట్లుగా చంద్ర‌బాబు ప‌రిస్థితి ఉంద‌ని ఎద్దేవా చేశారు. ఆయ‌న వ‌న్ థ‌ర్డ్, వ‌న్ థ‌ర్డ్ గా స‌మ‌యాన్ని విభజించుకున్నారు. ఒక‌సారి త‌న‌ను తిడ‌తార‌ని, మ‌రోసారి ఈవీఎంల‌ను, తిట్టార‌ని, త‌ర్వాత ఎన్నిక‌ల సంఘాన్ని తిడుతున్నార‌ని ఎద్దేవా చేశారు. మ‌ళ్లీ తాము అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని మోడీ ధీమా వ్య‌క్తం చేశారు.

Tags:    

Similar News