ఎప్పుడైనా రావచ్చు.. ద్వారాలు తెరిచే ఉంటాయి

రైతు సంఘాల నాయకులతో తాము ఎప్పుడైైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. రైతులకు ప్రయోజనాలు చేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన వివరించారు. [more]

Update: 2021-02-26 02:02 GMT

రైతు సంఘాల నాయకులతో తాము ఎప్పుడైైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. రైతులకు ప్రయోజనాలు చేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన వివరించారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దుల్లో నెలలుగా రైతులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలను నరేంద్ర సింగ్ తోమర్ ఖండించారు. తాము ఇప్పటికే 12 దఫాలు రైతు సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపామన్నారు. సుప్రీంకోర్టులో ఉన్నందున సాగు చట్టాలను నిలిపేశామని ఆయన చెప్పారు. రైతులు ఎప్పుడైనా చర్చలకు రావచ్చని ఆయన తెలిపారు. తమ ప్రభుత్వం ద్వారాలు తెరిచే ఉంచుతుందని నరేంద్రసింగ్ తోమర్ తెలిపారు.

Tags:    

Similar News