రేపు మోదీ ప్రసంగం.. లాక్ డౌన్ పై?

రేపు ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. లాక్ డౌన్ పొడిగింపుపై నరేంద్ర మోదీ ప్రకటన చేసే అవకాశముంది. ఏప్రిల్ 14వ తేదీ వరకూ దేశంలో లాక్ [more]

Update: 2020-04-10 06:50 GMT

రేపు ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. లాక్ డౌన్ పొడిగింపుపై నరేంద్ర మోదీ ప్రకటన చేసే అవకాశముంది. ఏప్రిల్ 14వ తేదీ వరకూ దేశంలో లాక్ డౌన్ విధించారు. లాక్ డౌన్ ను ఎత్తివేయాలా? కొనసాగించాలా? అన్న దానిపై ఇప్పటికే అన్ని వర్గాలతో కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు చేస్తుంది. మోదీ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలను తీసుకున్నారు. రేపు ముఖ్యమంత్రులతో కూడా మోదీ మాట్లాడనున్నారు. ముఖ్యమంత్రులతో సమావేశం తర్వాత లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఆ సమావేశం ముగిసిన తర్వాత మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు.

Tags:    

Similar News