అట్టహాసంగా నరేంద్ర మోడీ నామినేషన్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారణాసి లోక్ సభ స్థానానికి ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో అట్టహాసంగా జరిగింది. నిన్ననే వారణాసిలో నరేంద్ర మోడీ భారీ [more]

Update: 2019-04-26 06:29 GMT

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారణాసి లోక్ సభ స్థానానికి ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో అట్టహాసంగా జరిగింది. నిన్ననే వారణాసిలో నరేంద్ర మోడీ భారీ రోడ్ షో నిర్వహించినా ఇవాళ కూడా ఆయన నామినేషన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు, ప్రజలు హాజరయ్యారు. విద్యావేత్త డా.అన్నపూర్ణ చేతులమీదుగా ఆయన నామినేషన్ పత్రాలు తీసుకొని, ఆమె ఆశీర్వాం తీసుకొని నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ అధ్యక్షులు అమిత్ షా, కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ తో పాటు మిత్రపక్షాల నేతలు నితీష్ కుమార్, ఉద్ధవ్ ఠాక్రే, పన్నీర్ సెల్వం, రాంవిలాస్ పాశ్వాన్ తదితరులు హాజరయ్యారు. అకాళీదళ్ నేత ప్రకాశ్ సింగ్ బాదల్ కు నరేంద్ర మోడీ పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు.

Tags:    

Similar News