నేనున్నప్పుడు… జగన్ వచ్చినప్పుడు…!!

తాము అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ కొరత లేకుండా చేయలగలిగామని, వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్తు కోతలను అమలు చేస్తుందని తెలుగుదేశం [more]

Update: 2019-07-04 08:15 GMT

తాము అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ కొరత లేకుండా చేయలగలిగామని, వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్తు కోతలను అమలు చేస్తుందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. ఆయన గుంటూరు పార్టీ కార్యాలయంలో మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడారు. తాము అధికారంలో ఉన్న ప్పుడు రైతులకు విత్తనాలు, ఎరువుల సమస్య తలెత్తకుండా చేసేవారమని, ఇప్పుడు వైసీపీ అధికారంలోకి రాగానే విత్తనాలను కూడా సరఫరా చేయలేని పరిస్థితి ఉందన్నారు. ఆ నెపాన్ని వైసీపీ నేతలు తమపై నెడుతున్నారన్నారు. ప్రజలు వైసీపీ నేతలు అనుకున్నంత అమాయకులు కాదని, వారికి అన్నీ తెలుసునని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. వైసీపీ అధికారంలోకి రాగానే ఒక పద్ధతి, ప్రణాళిక లేకుండా ముందుకు వెళుతుండటం వల్లనే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. అమరావతి నిర్మాణం పెద్ద స్కాం అనడం విచారకరమని, దీంతో అభివృద్ధి కుంటుపడుతుందని, పెట్టుబడిదారులెవ్వరూ ఇక్కడకు రారని చంద్రబాబునాయుడు ఆందోళన వ్యక్తం చేశారు.

Tags:    

Similar News