మీ అమ్మాయిలు చదివింది ఎక్కడో?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర విమర్శలుచేశారు. ఇంగ్లీష్ మీడియం పెట్టేందుకు గతంలోనే తెలుగుదేశం పార్టీ ప్రయత్నించిందని, [more]

Update: 2019-11-11 11:19 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర విమర్శలుచేశారు. ఇంగ్లీష్ మీడియం పెట్టేందుకు గతంలోనే తెలుగుదేశం పార్టీ ప్రయత్నించిందని, అప్పుడు మీరు, మీ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేయలేదా? అని ప్రశ్నించారు నారా లోకేష్, మీ పత్రికలోనూ మాతృభాషకు అన్యాయం అంటూ హెడ్డింగ్ లతో కూడిన కథనాలు వచ్చిన సంగతి గుర్తులేదా అని నిలదీశారు. మీ అమ్మాయిలు తెలుగు మీడియంలోనే చదివారా? అని జగన్ కు నారాలోకేష్ సూటి ప్రశ్న వేశారు. ట్విట్టర్ లో నారాలోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News