బీజేపీపై లోకేశ్ ట్విట్టర్ వార్

Update: 2018-06-26 06:25 GMT

ఆంధ్ర ప్రదేవ్ మంత్రి నారా లోకేశ్ బీజేపీపై, కేంద్ర ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా వార్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఆయన కేంద్రం రాష్ట్రానికి చేస్తున్న అన్యాయంపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. కడప ఉక్కు కోసం ఎంపీ సీఎం రమేశ్ దీక్ష ఏడవ రోజుకు చేరినందున ఆయన బీజేపీపై మరోసారి ట్వీట్లతో విమర్శలు గుప్పించారు. ‘కడప ఉక్కు, ఆంధ్రుల హక్కు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీ నెరవేర్చాలి అని పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్ చేస్తున్న దీక్ష ఏడవ రోజుకి చేరుకుంది. అయినా కేంద్రం నుండి ఎటువంటి స్పందన లేకపోవడం ఆంధ్రుల పట్ల బీజేపీ నేతల వైఖరిని మరోసారి బయటపడింది.’ ‘బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతియ్యడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. రాష్ట్ర బీజేపీ నాయకులు అసత్య ప్రచారాలు చెయ్యకుండా హామీల అమలు కోసం ఢిల్లీలో యాత్రలు చేస్తే బాగుంటుంది’ అని ఆయన ట్వీట్ చేశారు.

Similar News