జగన్ పై ట్విటర్ లో ఫైరయిన లోకేష్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ను బీహార్ లా మార్చేశారన్నారు. పచ్చని సీమలుగా [more]

Update: 2021-01-30 04:51 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ను బీహార్ లా మార్చేశారన్నారు. పచ్చని సీమలుగా ఉన్న ప్రాంతాలను ఫ్యాక్షన్ సీమలుగా జగన్ మార్చారని నారా లోకేష్ మండి పడ్డారు. జగన్ మాఫియా రాష్ట్రంలో రెచ్చిపోతుందన్నారు. జగన్ పెంచి పోషిస్తున్న ఇసుక మాఫియా గన్ లతో వచ్చి తూర్పు గోదావరి జిల్లాలో రెచ్చిపోతుందని నారా లోకేష్ జగన్ పై ట్విటర్ లో ఫైరయ్యారు.

Tags:    

Similar News