నేడు ప్రొద్దుటూరుకు లోకేష్

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు ప్రొద్దుటూరులో పర్యటించనున్నారు. టీడీపీ నేత సుబ్బయ్య దారుణ హత్యకు గురికావడంతో ఆయన పరామర్శకు వస్తున్నారు. టీడీపీ [more]

Update: 2020-12-30 03:13 GMT

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు ప్రొద్దుటూరులో పర్యటించనున్నారు. టీడీపీ నేత సుబ్బయ్య దారుణ హత్యకు గురికావడంతో ఆయన పరామర్శకు వస్తున్నారు. టీడీపీ నేత నందం సుబ్బయ్య నిన్న హత్యకు గురయిన సంగతి తెలిసిందే. అయితే ఇది రాజకీయ హత్యేనని టీడీపీ ఆరోపిస్తుంది. సుబ్బయ్య కుటుంబాన్ని నారా లోకేష్ పరామర్శించనున్నారు. హత్యారాజకీయాలు వైసీపీ ప్రభుత్వంలో ఎక్కువయ్యాయని లోకేష్ ట్వీట్ చేశారు. ఈహత్యలో ప్రమేయం ఉన్న ఎమ్మెల్యే శివప్రసాద్ ను, ఆయన బావమరిదిని అరెస్ట్ చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు.

Tags:    

Similar News