జగన్ సర్కార్ పై మరోసారి లోకేష్

అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను మర్చిపోతుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకాన్ని [more]

Update: 2020-12-27 03:18 GMT

అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను మర్చిపోతుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకాన్ని వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల హామీలను కూడా జగన్ ప్రభుత్వం అమలు చేయడం లేదున్నారు. ఎన్టీఆర్ విదేశీ విద్య పథకాన్ని పూర్తిగా జగన్ నిర్వీర్యం చేశారన్నారు. ప్రయివేటు కళాశాల్లలో పీజీ చదివే విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకాన్ని రద్దు చేయడంపై లోకేష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పేద విద్యార్థులందరీకీ ఆ పథకాన్ని వర్తింపచేయాలని లోకేష్ డిమాండ్ చేశారు.

Tags:    

Similar News