గాల్లో తిరిగిన జగన్ ను ఏమనాలి?

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఫైరయ్యారు. రైతాంగాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమయిందని ఆయన ఆరోపించారు. వరదలు, వర్షాలతో రైతులు ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం [more]

Update: 2020-10-30 06:12 GMT

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఫైరయ్యారు. రైతాంగాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమయిందని ఆయన ఆరోపించారు. వరదలు, వర్షాలతో రైతులు ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. తనకు ఏ హోదా ఉందని ఒక మంత్రి ప్రశ్నించారని, తనకు హోదా లేదని రైతుల పట్ల ఆవేదన ఉందని లోకేష్ తెలిపారు. తనను ఒక మంత్రి ఎద్దు అని అన్నారని, వరద ప్రాంతాల్లో గాల్లో పర్యటించిన జగన్ ను ఏమనాలని లోకేష్ ప్రశ్నించారు. వారం మునిగిపోతేనే సాయం చేస్తారా? అని లోకేష్ నిలదీశారు. తమ ప్రభుత్వం తిత్లీ తుపాను బాధితులకు 28 రోజుల్లో సాయం అందించిన విషయాన్ని లోకేష్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Tags:    

Similar News