జగన్ కు నారా లోకేష్ లేఖ

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. ప్రభుత్వం మారిన నాటి నుంచి భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు [more]

Update: 2020-06-25 06:19 GMT

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. ప్రభుత్వం మారిన నాటి నుంచి భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇసుక దొరకకపోవడంతో అనేక రోజులు భవన నిర్మాణాలు సాగక పస్తులు ఉండాల్సి వచ్చిందన్నారు లోకేష్. దాదాపు 60 మందికి పైగానే ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా చెలరేగిపోతుందని, దానికి అడ్డుకట్ట వేయాలని లోకేష్ కోరారు. భవన నిర్మాణ కార్మికులను ఆదుకునేందుకు సంక్షేమ బోర్డు, పథకాలను అమలు చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు.

Tags:    

Similar News