జగన్ ఇగో వదిలి ముందుకు రావయ్యా

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన ఇగోతో రాష్ట్ర ప్రజలను ఇబ్బందుల్లోకి నెడుతున్నారని టీడీపీ నేత నారా లోకేష్ ట్విట్టర్ లో విమర్శించారు. ప్రపంచమంతా కరోనా అంటే [more]

Update: 2020-03-18 09:19 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన ఇగోతో రాష్ట్ర ప్రజలను ఇబ్బందుల్లోకి నెడుతున్నారని టీడీపీ నేత నారా లోకేష్ ట్విట్టర్ లో విమర్శించారు. ప్రపంచమంతా కరోనా అంటే భయపడుతుంటే జగన్ కు మాత్రం ఎన్నికలు కావాల్సి వచ్చాయన్నారు. కరోనా వైరస్ పట్ల జగన్ ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకపోవడాన్ని లోకేష్ తప్పు పట్టారు. దేశంలో మిగిలిన రాష్ట్రాలన్నీ అప్రమత్తమయితే ఇక్కడ మాత్రం కరోనా వైరస్ ను పట్టించుకోవడం లేదన్నారు. ప్రజల ప్రాణాలను రక్షించాలని నారా లోకేష్ కోరారు.

Tags:    

Similar News