జగన్ రెడ్డి.. కాదు .. జాంబిరెడ్డి.. ఫైర్ అయిన లోకేష్

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మండిపడ్డారు. జగన్ రెడ్డి జాంబిరెడ్డిలా వ్యవహరిస్తున్నారని నారా లోకేష్ ఎద్దేవా చేశారు. [more]

Update: 2021-04-16 01:03 GMT

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మండిపడ్డారు. జగన్ రెడ్డి జాంబిరెడ్డిలా వ్యవహరిస్తున్నారని నారా లోకేష్ ఎద్దేవా చేశారు. అనపర్తిలో లోకేష్ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించారు. అనపర్తి ఎమ్మెల్యే మంచినటుడు, అవినీతిపరుడతని లోకేష్ ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో అధికారం తమదేనని, తమ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే తాటతీస్తామని లోకేష్ హెచ్చరించారు. డీజీపీ పోలీసు డ్రెస్ తీసేసి వైసీపీ కండువా కప్పుకుంటే మంచిదని లోకేష్ సూచించారు.

Tags:    

Similar News