బాబు పర్యటనను అడ్డుకోవడంపై లోకేష‌ ట్వీట్

విశాఖలో చంద్రబాబు పర్యటనను వైసీపీ అడ్డుకుంటుండటంపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. ఆయన ట్విట్టర్ లో స్పందించారు. ఉత్తరాంధ్రకు అన్యాయం చేస్తున్న జగన్ [more]

Update: 2020-02-27 06:01 GMT

విశాఖలో చంద్రబాబు పర్యటనను వైసీపీ అడ్డుకుంటుండటంపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. ఆయన ట్విట్టర్ లో స్పందించారు. ఉత్తరాంధ్రకు అన్యాయం చేస్తున్న జగన్ ను గో బ్యాక్ అనాలని లోకేష్ పిలుపు నిచ్చారు. గత ఎనిమిది నెలలుగా ఉత్తరాంధ్రకు అన్యాయం జరుగుతూనే ఉందన్నారు. ఆరు నెలల నుంచి ఉత్తరాంధ్ర, సీమ ప్రాంతాల నుంచి పరిశ్రమలు గో బ్యాక్ అంటూనే ఉన్నాయని ఎద్దేవా చేశారు. జగన్ గో బ్యాక్ అంటేనే ఉత్తరాంధ్ర బాగుపడుతుందని లోకేష్ ట్వీట్ చేశారు.

Tags:    

Similar News