నారా లోకేష్ వ్యాఖ్యలు వైరల్

మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గురువారం ఆయన మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలో ప్రచారం నిర్వహించారు. ఈ [more]

Update: 2019-03-21 10:49 GMT

మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గురువారం ఆయన మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… ఏప్రిల్ 9న అందరూ సైకిల్ గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని కోరారు. దీంతో పక్కనే ఉన్న ఓ స్థానిక నాయకుడు ఎన్నికలు 11న అని లోకేష్ కు చెప్పడంతో ఆయన నాలుక కర్చుకున్నారు. వెంటనే ఏప్రిల్ 11న తనకు ఓటేయాలని చెప్పారు. దీంతో ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక, మంగళగిరి వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా దీనిపై స్పందిస్తూ.. లోకేష్ చెప్పినట్లుగా ఏప్రిల్ 9న సైకిల్ గుర్తుకు ఓటేయాలని, ఏప్రిల్ 11న మాత్రం ఫ్యాను గుర్తుకు ఓటేయాలని కోరారు. తాజాగా వివేకానందరెడ్డి మరణంతో తాను పరవశించానని లోకేష్ చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ గా మారిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News