కోడికత్తి దాడిపై ఇంత రాద్ధాంతమా...?

Update: 2018-11-02 12:56 GMT

కోడికత్తి దాడిపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దాడి జరిగింది ఎయిర్ పోర్ట్ లో అయితే, జగన్ పై దాడి చేసింది ఆయన అభిమాని అని చంద్రబాబు చెప్పారు. ప్రకాశం జల్లాలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జగన్ కేసుల మాఫీకోసం బీజేపీ పంచన చేరారన్నారు. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే బొబ్బిలిపులిలా రెచ్చిపోవాలని ఎన్టీఆర్ చెప్పారని ఆయన గుర్తు చేశారు. తాను ఢిల్లీ వెళుతుంటే అక్కడే ఉంటానని అనుకోవద్దని, ఇక్కడే రాజకీయాల్లో కొనసాగుతానని చెప్పారు. ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టడానికే ఢిల్లీ వెళ్లానన్నారు. ఏపీలో అభివృద్ధిని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయన్నారు. కోడికత్తి దాడి, తుని రైలుదగ్దం ఘటన ఇందులో భాగమేనని ఆయన చెప్పారు. తనను రెచ్చగొడితే ఎవరికి భయపడనని, విభజన చట్టం అమలు చేయమని కోరితే టీడీపీ నేతలపై ఐటీ దాడులకు పాల్పడుతున్నారన్నారు. తన జీవితంలో ఎవరికీ భయపడబోనని ఆయన చెప్పారు.

Similar News