చ్రందబాబుకు రెండోనోటీసు రెడీ

Update: 2018-09-14 13:03 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రెండో నోటీసు తీవ్రంగా ఉంటుందని సినీనటుడు శివాజీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబ్లీ కేసులో నోటీసులు ఇవ్వడం చంద్రాబాబును ట్రాప్ లో పడేయడానికేనని శివాజీ అభిప్రాయపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రయివేటు విమానంలో తిరగవద్దని సలహా ఇచ్చారు. అది ఆయనకు ప్రమాదకరమని శివాజీ తెలిపారు. చంద్రబాబును అరెస్ట్ చేస్తే టీడీపీ నేతలందరూ ఇతర పార్టీల్లోకి వెళతారని, అప్పుడు ముందస్తు ఎన్నికలకు వెళ్లవచ్చన్నదే కేంద్రం ఆలోచనగా ఉందన్నారు. వైసీపీ అధినేత జగన్ తో పాదయాత్ర చేయడానికి ఆయనేమన్నా మహాత్మాగాంధీనా? అని ప్రశ్నించారు. ఏపీలో కుట్ర జరుగుతుందని గతంలోనే చెప్పానని, చంద్రబాబుకు వచ్చే రెండో నోటీసు తీవ్రంగా ఉంటుందని, జాగ్రత్తగా, న్యాయనిపుణులతో చర్చించి వ్యవహరించాలని సినీనటుడు శివాజీ సూచించారు.

Similar News