బాబు మానసిక పరిస్థితిపై రోజా ఆందోళన

Update: 2018-10-26 06:14 GMT

చంద్రబాబు నరరూప రాక్షసుడని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై లేని పోని అభాండాలు వేస్తున్నారన్నారు. జగన్ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఇంటికి వెళ్లారని, ఇంట్లో ఉండగా ఢిల్లీ నుంచి ఫోన్ వస్తే హాస్పిటల్ కు వెళ్లారనిచంద్రబాబు చెప్పడం దుర్మార్గపు చర్యగా ఆమె అభివర్ణించారు. మీకు వత్తాసు పలికే ఛానళ్లన్నీ శంషాబాద్ ఎయిర్ పోర్టులోనే ఉన్నాయని, వాటిని అడిగి తెలుసుకోవాలని రోజా కోరారు. ఎవరైనా దాడికి గురైతే వెంటనే వారిని పరామర్శించడం మన సంప్రదాయం, సంస్కృతి అని, కేసీఆర్, కేటీఆర్, పవన్ కల్యాణ్ లు జగన్ పై దాడులను ఖండిస్తే దానిని తప్పుపట్టిన నీ మానసిక పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోగలమని రోజా అన్నారు. సొంత మామను చంపిన నీకు ప్రతిపక్ష నేత ఒక లెక్కా అని రోజా నిలదీశారు. అబద్ధపు ప్రచారం చేయడంలో చంద్రబాబు దిట్ట అని రోజా అన్నారు. జగన్ పై హత్యాయత్నం చేసింది చంద్రబాబేనని రోజా మరోసారి ధ్వజమెత్తారు.

Similar News