నేను నోరు తెరిస్తే అంతే

తాను పద్ధతిగా మాట్లాడతానని, తనను రెచ్చగొడితే తనలా బూతులు మాట్లాడేవారు మరొకరు ఉండరని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. రాష్ట్రం నలుగురి మంత్రుల చేతుల్లో నలిగిపోతుందన్నారు. రెండేళ్లలోనే [more]

Update: 2021-03-07 01:39 GMT

తాను పద్ధతిగా మాట్లాడతానని, తనను రెచ్చగొడితే తనలా బూతులు మాట్లాడేవారు మరొకరు ఉండరని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. రాష్ట్రం నలుగురి మంత్రుల చేతుల్లో నలిగిపోతుందన్నారు. రెండేళ్లలోనే ఆంధ్రప్రదేశ్ ఇరవై ఏళ్లకు వెనక్కు వెళ్లిపోయిందని బాలకృష్ణ ఆరోపించారు. తనకు ఒక పని కాదని, ఎన్నో పనులు ఉంటాయని, అయినా తను ప్రజాసేవ చేస్తున్నానని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. బాలకృష్ణ హిందూపురం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

Tags:    

Similar News