కరోనాను ప్రభుత్వం వదిలేయకూడదు

కరోనా ను ప్రభుత్వం వదిలేయకూడదని, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కోరారు. కరోనా విషయంలో ఎవరూ భయపడవద్దని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని బాలకృష్ణ కోరారు. [more]

Update: 2020-08-26 06:01 GMT

కరోనా ను ప్రభుత్వం వదిలేయకూడదని, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కోరారు. కరోనా విషయంలో ఎవరూ భయపడవద్దని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని బాలకృష్ణ కోరారు. కరోనాకు మందు జాగ్రత్త మాత్రమేనని ఆయన తెలిపారు. కరోనాకు మందు లేదన్న విషయాన్ని గుర్తుంచుకొని ప్రజలు బయటకు రావాలన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం షూటింగ్ లకు అనుమతిచ్చినా తాము ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. షూటింగ్ అంటే అనేక మంది ఉంటారని, త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని బాలకృష్ణ చెప్పారు.

Tags:    

Similar News